Advertisement

  • విషాదంలో జగన్ కుటుంబం... జగన్ సతీమణి భారతి తండ్రి కన్నుమూత...

విషాదంలో జగన్ కుటుంబం... జగన్ సతీమణి భారతి తండ్రి కన్నుమూత...

By: chandrasekar Sat, 03 Oct 2020 4:04 PM

విషాదంలో జగన్ కుటుంబం... జగన్ సతీమణి భారతి తండ్రి కన్నుమూత...


జగన్ కుటుంబం విషాదంలో మునిగింది సీఎం జగన్ యొక్క సతీమణి భారతి తండ్రి కన్నుమూసారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి స్వయానా మామ ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు. చిన్న గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి తండ్రి అన్న విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన పులివెందులలో పేదల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈసీ గంగిరెడ్డి మరణంతో సీఎం జగన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈమధ్యే సీఎం జగన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను పరామర్శించి వచ్చారు. ఇంతలోనే ఇలా అవ్వడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. గంగిరెడ్డితో అనుబంధాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.

వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ నేడు పులివెందులకు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన ఇంటి నుంచి జగన్ బయలుదేరుతారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Tags :
|

Advertisement