Advertisement

  • నేటి నుంచే ఏపీలో ‘జగనన్న విద్యాకానుక’ పథకం ప్రారంభం...!

నేటి నుంచే ఏపీలో ‘జగనన్న విద్యాకానుక’ పథకం ప్రారంభం...!

By: Anji Thu, 08 Oct 2020 08:27 AM

నేటి నుంచే ఏపీలో ‘జగనన్న విద్యాకానుక’ పథకం ప్రారంభం...!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా పునాదిపాడు హైస్కూల్‌లో సీఎం జగన్‌ ఈకార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా హై స్కూల్‌లో నాడు – నేడు పనులను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చటిస్తారు ముఖ్యమంత్రి జగన్.

అనంతరం స్టూడెంట్స్‌కి విద్యా కానుక కిట్లను అందజేస్తారు. ఈ కిట్టులో స్కూల్ బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫామ్స్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్‌ ఉంటాయి. యూనిఫామ్‌ కుట్టుకూలి డబ్బులను ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేయనుంది.

Tags :
|
|
|

Advertisement