ఇండియాకి రానున్న జగన్ చెల్లి విరానికా
By: chandrasekar Fri, 12 June 2020 7:11 PM
ఏపీ సీఎం జగన్
చిన్నాన్న కూతురు, యువ హీరో మంచు విష్ణు భార్య అయిన విరానికా వంద రోజుల
తర్వాత ఎట్టకేలకు విదేశాల నుంచి ఇండియాకు బయల్దేరారు. జగన్కు వరుసకు
చెల్లైన విరానికా ప్రముఖ నటుడు మంచు మోహన్బాబు ఇంటి కోడలనే విషయం
తెలిసిందే. విదేశాలకు వెళ్లిన తన
భార్య, పిల్లలు
లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకున్నారని, ఎప్పుడూ ఇన్ని రోజులు వాళ్లను విడిచి ఉండలేదంటూ.
ఇటీవల మంచు విష్ణు
భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.లాక్డౌన్
ముందు బంధువులను కలవాడిని విరానికా తన పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లారు.
మార్చి చివరి వారంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రకాల రవాణా
వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.
లాక్డౌన్ని సడలించడంతో పాటు వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో
చిక్కుకున్న భారతీయులను తిరిగి ఇండియాకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వందే భారత్
మిషన్ ద్వారా మంచు విష్ణు భార్య, జగన్ చెల్లి అయిన విరానికాతో పాటు వారి పిల్లలు
సింగపూర్ నుంచి ఇండియాకి బయల్దేరారు.ఈ విషయాన్ని స్వయంగా విరానికా తన ట్విటర్
ద్వారా తెలిపారు. వందరోజుల తర్వాత తాను సింగపూర్ నుంచి తమ ఇంటికి వెళుతున్నట్టు
ఆమె వెల్లడించారు. పిల్లలతో కలిసి ఇండియాలోని తమ ఇంటికి వెళ్లేందుకు సాయపడ్డ
ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వంద రోజుల తర్వాత
విరానికా, పిల్లలు
ఇంటికి వస్తున్నతరుణంలో ఆనందం మంచు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.