రమేష్ ఆస్పత్రిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధ౦
By: chandrasekar Wed, 02 Sept 2020 6:34 PM
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది...
విజయవాడ సర్ణ ప్యాలెస్ రమేష్ ఆస్పత్రి కరోనా కేర్ సెంటర్ ప్రమాదానికి సంబందించి ఒక నిర్ణయం తీసుకుంది. రమేష్ ఆస్పత్రి అధినేత రమేష్ బాబు, ఛైర్మన్ సీతారాంమోహన్పై తదుపరి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది జగన్ సర్కార్. పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్పై గత మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్ రమేష్తో పాటు హాస్పిటల్ ఛైర్మన్పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అసలు స్వర్ణ ప్యాలెస్ను క్వారంటైన్ సెంటర్గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదన్న ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా సెంటర్లో అగ్నిప్రమాదం జరగడంతో 10
మంది చనిపోగా మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో పలువుర్ని ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి రమేష్ బాబు కనిపించకుండా పోయారు.