ఆంధ్రప్రదేశ్ లో పేద నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త
By: chandrasekar Mon, 23 Nov 2020 3:56 PM
ఆంధ్రప్రదేశ్ లో పేద
నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇందుకోసం రాష్ట్రం లో నిరుద్యోగుల
కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు
ఆర్థిక భరోసా, ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. జనవరి నుంచి
ప్రారంభించే ఇంటింటికీ సబ్సిడీ బియ్యం పథకంలో భాగంగా 9,260 మంది
పేద నిరుద్యోగులను ఎంపిక చేసి భారీ సబ్సిడీతో మినీ ట్రక్కులను అందజేయనుంది. ఈ
మేరకు ఆ ప్రక్రియ ప్రారంభించింది. జనవరి నుంచి ఇంటింటికీ సబ్సిడీ బియ్యం పథకానికి
శ్రీకారం చుట్టబోతోంది. గోడౌన్ల నుంచి సరకులను డీలర్ షాపులకు చేర్చాలి. అక్కడ నుంచి
ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు.
సబ్సిడీ బియ్యం ఇంటింటికీ
పంపిణీ చేయుటకు ట్రక్కులతో అవసరం వచ్చింది. ఇప్పటికే వాహనాల కొనుగోలుకు సంబంధించిన
నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో వాహనం ఖరీదును రూ. 5.81
లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 60 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మినీ
ట్రక్కులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. ఈ నెల 27వ తేదీ
వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇక డిసెంబర్ 4న ఇంటర్వ్యూలు, 5న
లబ్దిదారుల తుది జాబితాను ప్రకటించనున్నారు. వారికి ఆ ట్రకుల్ని అప్పగించనున్నారు.
జనవరి నుంచి ఇంటింటికి బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. దీనిద్వారా
ట్రక్కుల్లో పంపిణీ చేయడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి మార్గం కలగనుంది.