ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఫీజులను రద్దు చేసిన జగన్ ప్రభుత్వం
By: chandrasekar Tue, 15 Dec 2020 10:22 AM
కరోనా వైరస్ కారణంగా
ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు
పరిధిలోని వివిధ రకాల ఫీజులను ఇంటర్ విద్యార్థులకు రద్దుచేసింది. కరోనా సంక్షోభం
కారణంగా విద్యార్థులకు అందించే వివిధ రాయితీలులో భాగంగా అడ్మిషన్ ఫీజులు, రీఅడ్మిషన్
ఫీజులు, తెలుగు నుండి ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుటకు ఫీజులో, గ్రూపు
మార్పునకు సంబంధించిన ఫీజులు అన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం
ప్రకటించింది.
ఇందుకోసం రాష్టంలోని
ఇకమీదట వీటికి సంబంధించిన ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని ఇంటర్ కళాశాలల
ప్రిన్సిపాల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబడింది. ఫీజులు రద్దు
ప్రకటించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇంటర్ విద్యార్థులకు ఇది ఎంతో మేలు
చేకూర్చేందుకు ఉపయోగపడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కారణంగా
చాలామంది ఉద్యోగాలు మరియు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరికి ఇది ఎంతగానో
ఉపయోగపడనుంది.