Advertisement

  • మహానేత దివంగత వైఎస్సార్ 11 వ వర్ధంతికి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

మహానేత దివంగత వైఎస్సార్ 11 వ వర్ధంతికి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

By: Sankar Wed, 02 Sept 2020 11:27 AM

మహానేత దివంగత వైఎస్సార్ 11  వ వర్ధంతికి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు


దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి ఇతర కుటుంబసభ్యులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, రవీంద్రనాథ్‌ రెడ్డి, అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

అయితే బుధవారం వైఎస్సార్‌ 11వ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘ నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మ‌హానేత శ‌రీరానికి మ‌ర‌ణం ఉంటుంది కానీ, ఆయ‌న జ్ఞాప‌కాల‌కు, ప‌థ‌కాల‌కు ఎప్పుడూ మ‌ర‌ణం ఉండ‌దు. నా ప్రతి అడుగులోనూ నాన్న‌ తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నార’’ని పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement