Advertisement

  • వేదిక మీదనే గొడవ పడ్డ రాష్ట్ర సీనియర్ నాయకులు

వేదిక మీదనే గొడవ పడ్డ రాష్ట్ర సీనియర్ నాయకులు

By: Sankar Sun, 31 May 2020 8:12 PM

వేదిక మీదనే గొడవ పడ్డ రాష్ట్ర సీనియర్ నాయకులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరొక సారి నాయకుల మధ్య ఉన్న రాజకీయ విబేధాలు బయట పడ్డాయి ..అయితే ఈ సారి గొడవ పడింది ఒకరు రాష్ట్ర మంత్రి అయితే మరొకరు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులూ గొడవ పడ్డ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..

తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఇద్దరు నేతలు మధ్య పరస్పర విమర్శలకు దిగారు. రైతు రుణమాఫీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా... వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్దానికి తెరలేపారు. ‘నువ్‌ పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌పై మంత్రి జగదీష్‌ సెటైర్‌ వేయగా.. ‘నువ్‌ మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ కౌంటర్ వేశారు.

మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేస్ లో తాను ఉన్నానంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు ..ఇప్పటికిపుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిన అవసరం లేదు అన్న అయన , రేవంత్ రెడ్డి కి ఇస్తే మాత్రం తాను వ్యతిరేకిస్త అని అన్నాడు ..ఒకవేళ ఉత్తమ్ ను మార్చాలి అనుకుంటే సీనియర్ నాయకుడిగా నేను కూడా రేస్ లో ఉన్న అని తన మనసులో మాటను బయట పెట్టాడు


Tags :
|

Advertisement