Advertisement

  • ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కి దూరం కానున్న జడేజా....

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కి దూరం కానున్న జడేజా....

By: chandrasekar Tue, 08 Dec 2020 3:47 PM

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కి దూరం కానున్న జడేజా....


డిసెంబరు 17 నుంచి ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్‌కి టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ విసిరిన బౌన్సర్ బంతిని ఫుల్ చేసేందుకు రవీంద్ర జడేజా ప్రయత్నించగా బ్యాట్‌కి చిక్కని బంతి నేరుగా వెళ్లి అతని హెల్మెట్‌ని బలంగా తాకింది. దాంతో ఫీల్డింగ్ సమయంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్ రూపంలో జడేజాకి బదులుగా చాహల్ మైదానంలోకి దిగాడు.

అదే మ్యాచ్‌లో జడేజా తొడ కండరాలకీ గాయమైంది. దాంతో.. మిగిలిన రెండు టీ20లకీ దూరమైన జడేజా తొలి టెస్టు టైమ్‌కి కూడా ఫిట్‌నెస్ సాధించడంపై అనుమానాలు ఉన్నాయి. రవీంద్ర జడేజా తొడ కండరాల గాయాన్ని పరిశీలించిన వైద్యులు కనీసం మూడు వారాలు విశ్రాంతి అవసరమని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 11 నుంచి ప్రారంభంకానున్న ప్రాక్టీస్ మ్యాచ్‌తో పాటు డిసెంబరు 17న ఆరంభమయ్యే తొలి టెస్టుకీ కూడా రవీంద్ర జడేజా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొడుతున్న రవీంద్ర జడేజా మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభమన్ గిల్, సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్

షెడ్యూల్...

తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17 నుంచి- అడిలైడ్ ఓవెల్ (2:00 PM)- డే/నైట్ టెస్టు

రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 26 నుంచి- మెల్‌బోర్న్ (4:30 AM )

మూడో టెస్టు మ్యాచ్ జనవరి 7 నుంచి- సిడ్నీ (4:30 AM)

నాలుగో టెస్టు మ్యాచ్ జనవరి 15 నుంచి- గబ్బా (5:30 AM)

Tags :
|
|

Advertisement