బాక్సింగ్ డే టెస్ట్ తో అరుదయిన రికార్డు సాధించి కోహ్లీ , ధోని సరసన నిలిచిన జడేజా
By: Sankar Tue, 29 Dec 2020 4:34 PM
టీమ్ఇండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో భారత్ తరఫున 50, అంతకన్నా ఎక్కువ మ్యాచ్లు ఆడిన మూడో భారత క్రికెటర్గా జడేజా ఎలైట్ క్లబ్లో చేరాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సరసన జడ్డూ నిలువడం విశేషం.
జడేజా ఇప్పటి వరకు 50 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ధోనీ, కోహ్లీతో దిగిన ఫొటోలను జడేజా ట్విటర్లో షేర్ చేశాడు. తనకు ఇన్నేండ్లుగా మద్దతుగా నిలిచి, సహకరించిన బీసీసీఐ, సహాయక సిబ్బందికి జడేజా ధన్యవాదాలు తెలిపాడు. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో బ్యాట్, బంతితో రాణించిన జడేజా టెస్టుల్లో 15వ అర్ధశతకం సాధించాడు.
కాగా ఇటీవల కాలంలో టీంఇండియాలో జడేజా అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు ..ముఖ్యంగా గత కొంతకాలంగా బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తూ లోయర్ ఆర్డర్ లో మంచి బాగస్వామ్యాలు నెలకొల్పుతూ టీమిండియా విజయాలలో కీలక భూమిక పోషిస్తున్నాడు..ఇక బౌలింగ్ , ఫీల్డింగ్ లో కూడా అదే స్థాయిలో అదరగొడుతూ టీమిండియాకు మ్యాచ్ విన్నర్ లాగ మారాడు..