Advertisement

  • అప్పుడు వద్దన్నారు ..ఇప్పుడు కావాలంటే రావడం కష్టం

అప్పుడు వద్దన్నారు ..ఇప్పుడు కావాలంటే రావడం కష్టం

By: Sankar Mon, 15 June 2020 10:40 AM

అప్పుడు వద్దన్నారు ..ఇప్పుడు కావాలంటే రావడం కష్టం



కరోనా కారణంగా దేశం మొత్తం మీద అత్యంత ఎక్కువగా ప్రభావితం అయిన వారు వలస కార్మికులు ..ఎన్నో కష్టాలు పడి ఇప్పుడిప్పుడే అందరు తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు ..ఇంకా చాల మంది ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు ..అయితే దేశంలో లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేస్తుండటం , అన్ని రంగాలకు మళ్ళీ అనుమతులు ఇస్తుండటంతో వలస కూలీలా అవసరం మళ్ళీ యజమానులకు ఏర్పడింది ..అయితే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకొని సొంత ప్రాంతాలకు చేరిన కార్మికులు మళ్ళీ తిరిగి రావడం చాల కష్టంగా మారింది..

ఇబ్బందులు పడి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి రావాలంటే రైళ్లల్లో రావాల్సిందే. అయితే అందుకు తగ్గట్లుఏర్పాట్లు యాజమాన్యాలు చేయడం కష్టమే. సొంతంగా వారు వచ్చే పరిస్థితి లేదు.అయితే కొందరు కార్మికులుమాత్రం రోడ్డుమార్గం ద్వారా వస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దు మినహా మిగతా రాష్ట్రాల వైపు నుంచి రాకపోకలపై ఆంక్షలు నెలకొంది. హైదరాబాద్‌ మహానరంతో పాటు శివారు ప్రాంతాల్లోని వివిధ రంగాల్లో పని చేస్తున్న సుమారు 13 లక్షల మంది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు..


not easy,migrant labour,come back,work,lockdown ,వలస కార్మికులు,  లాక్ డౌన్,  స్వరాష్ట్రాలకు,  హైదరాబాద్‌ , యాజమాన్యాలు



వాస్తవంగా ఉపాధి నిమిత్తం లేబర్‌ కాంట్రాక్టర్‌ (టేకేధార్‌) ద్వారా స్వస్థలాల నుంచి పనులు చేసే ప్రాంతాలకు, తిరిగి వేళ్లేటప్పుడు రైల్వే స్టేషన్ల వరకు చేర్చే బాధ్యత కూడా టేకేధార్లు నిర్వర్తిస్తారు.లాక్‌డౌన్‌ కష్ట కాలంలో ఇటూ యాజమాన్యం పట్టించుకోక పోగా, టేకేధార్లు కూడా పత్తా లేకుండా పోయారు. దీంతో వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో వారిని గాలికొదిలేసిన యాజమాన్యాలు తిరిగి మళ్లీ పిలవడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోగా.. ఇప్పుడు మీ అవసరం కోసం రమ్మంటున్నారా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మంచిజీతం, వసతి, వైద్య ఆరోగ్య సేవల సదుపాయాలను సమకూర్చుతామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని హామీ వచ్చిన తరువాతే కొందరు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.


Tags :
|

Advertisement