Advertisement

  • విచారణ పూర్తికాకముందే రియాచక్రవర్తిని దోషిగా చూపించడం తగదు: మంచు లక్ష్మి

విచారణ పూర్తికాకముందే రియాచక్రవర్తిని దోషిగా చూపించడం తగదు: మంచు లక్ష్మి

By: chandrasekar Tue, 01 Sept 2020 6:43 PM

విచారణ పూర్తికాకముందే  రియాచక్రవర్తిని దోషిగా చూపించడం తగదు: మంచు లక్ష్మి


సీబీఐతో పాటు వివిధ దర్యాప్తు సంస్థలు బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టూ ఈ కేసు తిరుగుతోంది.

ఈ నేపథ్యంలో ‘జస్టిస్‌ఫర్‌సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌' ‘జస్టిస్‌ఫర్‌రియాచక్రవర్తి' అంటూ మంచు లక్ష్మి సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. విచారణ పూర్తికాకముందే రియాచక్రవర్తిని దోషిగా చూపించడం తగదని ఆమె కోరింది. ప్రతి ఒక్కరు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి సత్యమేదో తెలిసేంత వరకు సంయమనం పాటించాలని కోరింది.

రియా చక్రవర్తి కుటుంబంపై నిజాలు నిర్ధారణ కాకుండా నిందలు వేయడం తప్పని మంచు లక్ష్మి తెలిపింది. దర్యాప్తు సంస్థలు సుశాంత్‌కు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అంతవరకు వేచి చూడాలని తెలిపింది.

Tags :
|
|

Advertisement