కరోనా దెబ్బతో మారిన ఐటీ పరిశ్రమల ప్రణాళికలు
By: chandrasekar Wed, 27 May 2020 1:11 PM
ఐటీ ఉద్యోగులతో
సందడిగా ఉండే టెక్నాలజీ పార్కులు,
ఆఫీసులు బోసిపోయాయి.
ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమై గత మూడు నెలలుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే
కరోనా మహమ్మారి ఇప్పట్లో శాంతించదని, ఇలాగే
విస్తరిస్తూనే ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
అతిపెద్ద
టెక్నాలజీ కంపెనీలన్నీ శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కల్చర్ ఏర్పాటు దిశగా పావులు
కదుపుతున్నారు. Twitter,
Facebook ఇప్పటికే
ఉద్యోగులతో శాశ్వత వర్క్ ఫ్రం హోం ప్రతిపాదన చేయగా, Google కూడా ఆ దిశగా
పరిశీలిస్తోంది. ప్రపంచ మహమ్మారి కారణంగా, ప్రపంచంలోని చాలా
పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండే పని ఇచ్చాయి. వర్క్ కు సంబంధించి
భవిష్యత్తు గురించి పెద్ద కంపెనీలు పలు రకాల ప్రణాళికలు రూపొందించాయి.
చైనాలో కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్నట్లు వార్తలు వచ్చినప్పుడే, ఇది ప్రపంచవ్యాప్త అంటువ్యాధిగా మారుతుందని పేస్ బుక్ అంచనా వేసింది. తన
ఉద్యోగులలో కొంతమందికి ఇంటి నుంచి దీర్ఘకాలిక పనిని అందించమని కోరింది. ఆ తరువాత, కరోనా పెరుగుతూనే ఉండటంతో,
Facebook చాలా మంది
ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయమని ఆదేశించింది. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు సీఈఓ
మార్క్ జుకర్బర్గ్ కుడా Work
From Home చేస్తున్నారు.
ఇటీవల వెర్జ్ అనే వెబ్ మాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పని సంస్కృతి గురించి
అనేక ప్రత్యేక విషయాలు చెప్పారు. జుకర్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం, సంస్థ రిమోట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్త ఉద్యోగులను తీసుకున్నట్లు
తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 48 వేల మంది ఫేస్బుక్ ఉద్యోగులలో చాలా మంది ఈ
ఏడాది చివరి వరకూ వర్క్ ఫ్రం హోం చేసే దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
పదేళ్ల పాటు
పనిచేసే రిమోట్ వర్క్ఫోర్స్ సిద్ధం చేసారు. Facebook ఇప్పటికే కొత్తగా
నియమించుకున్న ఉద్యోగులకు 15,000 డాలర్ల వరకు బోనస్ ప్రకటించింది. వీరంతా
అమెరికాలోని మెన్లో పార్క్ ప్రధాన కార్యాలయం అనుబంధంగా పనిచేస్తన్నారు. కోవిడ్ 19 అనంతరం Facebook వర్క్ ఫ్రం హోం ద్వారా విధులు నిర్వర్తించే
అతిపెద్ద సంస్థగా అవతరించాలని చూస్తోంది. రాబోయే పదేళ్ళలో ఇంటి నుండి పని చేసే
పెద్ద శ్రామిక శక్తిని సిద్ధం చేస్తోంది.
రిమోట్ వర్క్
కల్చర్ Facebook వంటి పెద్ద సంస్థ పూర్తి స్థాయిలో అమలు
చేయాలంటే కొంత సమయం పడుతుందని జుకర్బర్గ్ స్పష్టంగా పేర్కొన్నాడు. అయితే రాబోయే
ఐదు నుంచి పది సంవత్సరాలలో, సంస్థ లోని సగం మంది ప్రజలు శాశ్వతంగా రిమోట్
గా పని చేసేందుకు సిద్ధంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మార్పు పూర్తి
వ్యూహంతో అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరానికి Work From Home చేసేలా ఉద్యోగులను సిద్ధం చేశారు. అయితే కోవిడ్
19 అనంతరం ఏం చేయాలి అనే దిశగా Facebook పావులు కదుపుతోంది.
Facebook సంస్థ జరిపిన ఒక సర్వేలో 40% మంది ఉద్యోగులు ఇంటి నుండే పని పట్ల ఆసక్తి చూపించారని జుకర్బర్గ్
ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే, చాలా మంది ఉద్యోగులు సానుకూల మార్పులను చూశారని, అలాగే Work From Home ద్వారా వారి సామర్థ్యం ప్రొడక్టవిటీ కూడా
పెరిగినట్లు కనుగొన్నారు. ఇంటి నుండి పని చేసేటప్పుడు తాను ఇంకా మరింత నిజాయితీగా
పని చేస్తున్నట్లు తాను భావించానని జుకర్బర్గ్ తెలిపారు.
ట్విట్టర్ తన
ఉద్యోగులకు వారం క్రితమే అనుమతి ఇచ్చింది. ఇంటి నుంచి పని చేసే వీలున్నవారికి
శాశ్వతంగా Work From Home ఎంపిక చేసుకునే అవకాశాన్ని ట్విట్టర్
కల్పించింది. ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి రావాలనుకుంటే, స్వాగతం పలుకుతామని వారి కోసం జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.
సెప్టెంబరుకి
కార్యాలయాన్ని తెరిచే అవకాశం లేదని 'ట్విట్టర్' స్పష్టం చేసింది. ఆఫీసు తెరిచినా పని చేసే పద్దతి మునుపటిలా ఉండదని. భౌతిక
దూరం, శుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకుంటామని
తెలిపింది. 2020 సంవత్సరంలోగా కంపెనీ ఎలాంటి ప్రత్యక్ష
మీటింగులు నిర్వహించదని పేర్కొంది. అలాగే ఈ ఏడాది చివరి వరకు వర్క్ ప్రం హోం
ప్రణాళికలను సిద్ధం చేసింది.
గూగుల్ సీఈఓ
సుందర్ పిచాయ్ తనతో పాటు సంస్థలోని చాలా మంది ఉద్యోగులు రిమోట్గా పనిచేస్తున్నారని
ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. హార్డ్వేర్ రంగంలో కూడా గూగుల్ ఒక పెద్ద
సంస్థ కాబట్టి, ఈ సంవత్సరం వరకు ఇంటి నుండే పని చేయడమే
వ్యూహమని పిచాయ్ తెలిపారు. అయితే ఆ తర్వాత కోవిడ్ 19 సంబంధిత
పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. గూగుల్, ఆల్ఫాబెట్ సిఇఒ
పిచాయ్ కూడా ఇంటి సంస్కృతి నుండి పని గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 'ఇంటి నుండి పని చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని, ఈ విషయం గురించి
ఆలోచిస్తున్నట్లు తెలిపారు.