పీఎస్ఎల్వీ- సీ49ను నవంబర్ 6న ప్రయోగించనున్న ఇస్రో..
By: chandrasekar Thu, 29 Oct 2020 2:24 PM
భారత అంతరిక్ష పరిశోధన
సంస్థ ఇస్రో ఈ ఏడాది తొలి ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి నవంబర్ 6న
ప్రయోగించ బోతోంది. పీఎస్ఎల్వీ- సీ 49 రాకెట్ భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్ -2 బీఆర్2తో
పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లను౦ది. ప్రయోగంలో
ఏదైనా ఆలస్యమైతే 7, 8 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది.
ఇస్రో ఈ ఏడాది
చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. కరోనా కారణంగా మార్చి నుంచి అన్ని
అంతరిక్ష కార్యకలాపాలు మందగించాయి. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్
లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.
రిశాట్-2 బీఆర్2
శాటిలైట్ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) ఏ
వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్ఏసీ వెంట
నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఎంతో
ఉపయుక్తంగా ఉండనుంది.
అలాగే నిఘాతో పాటు
వ్యవసాయం, అటవీ, నేల
తేమ, భూగర్భశాస్త్రం, తీర
పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా
పర్యవేక్షించవచ్చని నిపుణులు తెలియ చేస్తున్నారు. ఈ మిషన్ పూర్తయిన వెంటనే
డిసెంబర్లో జీశాట్-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు
పీఎస్ఎల్వీ-సీ 50 మిషన్ను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.