Advertisement

  • పీఎస్‌ఎల్‌వీ- సీ49ను నవంబర్‌ 6న ప్రయోగించనున్న ఇస్రో..

పీఎస్‌ఎల్‌వీ- సీ49ను నవంబర్‌ 6న ప్రయోగించనున్న ఇస్రో..

By: chandrasekar Thu, 29 Oct 2020 2:24 PM

పీఎస్‌ఎల్‌వీ- సీ49ను నవంబర్‌ 6న ప్రయోగించనున్న ఇస్రో..


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది తొలి ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి నవంబర్ 6న ప్రయోగించ బోతోంది. పీఎస్‌ఎల్‌వీ- సీ 49 రాకెట్ భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్ -2 బీఆర్2తో పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లను౦ది. ప్రయోగంలో ఏదైనా ఆలస్యమైతే 7, 8 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది.

ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. కరోనా కారణంగా మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించాయి. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.

రిశాట్-2 బీఆర్2 శాటిలైట్‌ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్‌) ఏ వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్‌ఏసీ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్‌ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.

అలాగే నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు తెలియ చేస్తున్నారు. ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్‌లో జీశాట్‌-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 50 మిషన్‌ను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :
|
|

Advertisement