పీఎస్ఎల్వీ సి-50 ప్రయోగం విజయవంతం
By: Sankar Thu, 17 Dec 2020 4:59 PM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలు రాయిని అందుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి-50 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.
మధ్యాహ్నం 3.41 గంటలకు సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకుంటూ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో ఛైర్మన్ శివన్ సంతోషం వ్యక్తంచేశారు.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. కొవిడ్-19 వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతమైన పనితీరు కనబర్చారని కొనియాడారు.
కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థ సీఎంఎస్-01 శాటిలైట్ మొత్తం ఏడేళ్ల పాటు సేవలందించనుంది. ఈ ఉపగ్రహం బరువు 1410 కిలోలు.. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్ సేవలను అందించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.