భారత బలగాలకు చెందిన ఆయుధాల స్మగ్లింగ్కు ఐఎస్ఐ కుట్ర..!
By: chandrasekar Tue, 10 Nov 2020 4:38 PM
శ్రీనగర్: పాకిస్థాన్
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ భారత బలగాలకు చెందిన ఆయుధాలను స్మగ్లింగ్
చేసేందుకు కుట్ర పన్నినట్లు భారత నిఘా వర్గాలు
కనుగొన్నాయి.
ఐఎస్ఐ దీని కోసం ఖలిస్తానీ
ఉగ్రవాదులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ సరిహద్దు
వెంబడి ఉన్న గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో పోలీసులను నిఘా వర్గాలు
అప్రమత్తం చేశాయి.
ఎల్వోసీ గుండా జమ్మూకశ్మీర్లోకి
ఉగ్రవాదులు చొరబాటు చేసేందుకు యత్నించే అవకాశం ఉందన్నారు. ఆయుధాల స్మగ్లింగ్కు
ఉగ్రవాదులు ఇప్పటికే కసరత్తు చేసినట్లు సమాచారం.
Tags :
isi |
weapons |