నిర్మలా సీతారామన్ అదే శాఖలో ఉంటారా? లేదా?
By: chandrasekar Sat, 10 Oct 2020 8:02 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల
తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
దివంగత నేత రాంవిలాస్ పాస్వాన్ శాఖలను వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్కు
అప్పగించడంతో ఈ వాదను బలం చేకూరుతోంది.
నవంబరు 10న
బిహార్ ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే ప్రధాని మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
చేపడ్తారని భావిస్తున్నారు. తాజా మార్పుల్లో బీజేపీ ఎంపీలకే ఎక్కువ అవకాశాలుంటాయని, బిహార్
ఫలితాలను బట్టి జేడీయూ నేతలకూ స్థానం కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రధాని చేపట్టే భారీ
మార్పుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదే శాఖలో ఉంటారా? లేదా? అన్నది
రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిర్మల సమర్థవంతంగానే పని చేస్తున్నప్పటికీ
వ్యాపార,పారిశ్రామిక, ఆర్థిక
వర్గాల్లోనూ, మధ్య తరగతి, సామాన్య వర్గాల్లోనూ విశ్వాసాన్ని పొందలేకపోతున్నారన్న
అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో పరిశ్రమలు, వ్యాపార
రంగానికి విశ్వాసం కలిగించి జనాదరణ సంపాదించగల ఆర్థిక మంత్రిగా ఎవర్ని
నియమించాలన్న దానిపై మోదీ, అమిత్ షా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్తగా మంత్రివర్గంలో చేరే వారిలో జ్యోతిరాదిత్య సింధియా, సురేశ్
ప్రభుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.