Advertisement

  • సచిన్ శతకాల రికార్డ్ బద్ధలవ్వడమే కాకుండా సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందన్న ఇర్ఫాన్ పఠాన్

సచిన్ శతకాల రికార్డ్ బద్ధలవ్వడమే కాకుండా సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందన్న ఇర్ఫాన్ పఠాన్

By: chandrasekar Tue, 25 Aug 2020 09:17 AM

సచిన్ శతకాల రికార్డ్ బద్ధలవ్వడమే కాకుండా సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందన్న ఇర్ఫాన్ పఠాన్


క్రికెట్లో భారత స్టార్ బాట్స్మన్ సచిన్ శతకాల రికార్డ్ బద్ధలవ్వడమే కాకుండా సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని చెప్పిన ఇర్ఫాన్ పఠాన్. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 అంతర్జాతీయ శతకాల రికార్డ్‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే బ్రేక్ చేయగలడని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ జోస్యం చెప్పాడు. ఇప్పటి వరకూ 43 వన్డే సెంచరీలు, 23 టెస్టు శతకాల రూపంలో మొత్తం 70 ఇంటర్నేషనల్ సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ మరో పదేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు చెప్తున్నారు.

విరాట్ అలాగే ఆడగలిగితే సచిన్ శతకాల రికార్డ్ బద్ధలవ్వడమే కాకుండా సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ రికార్డుల గురించి తాజాగా స్టార్‌స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ తర్వాత 100 సెంచరీల మైలురాయిని అందుకోగల సత్తా ఉన్నా ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. 12 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇప్పటికే కోహ్లీ చాలా సాధించాడు. తన అంచనా ప్రకారం సచిన్ 100 సెంచరీల రికార్డ్‌ని ఎవరైనా బద్ధలు కొట్టగలరంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. అతనిలో ఆ సామర్థ్యం, ఫిట్‌నెస్ ఉందని వెల్లడించాడు.

ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ జరగనుండగా స్పెషల్ ఛార్టర్డ్ ప్లైట్‌లో ముంబయి నుంచి యూఏఈకి కోహ్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్‌లో కోహ్లీతో పాటు ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లందరూ ఉండగా వారికి మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఐపీఎల్‌లోనూ విరాట్ కోహ్లీ ఐదు సెంచరీలు బాదాడు. చాలా రోజులుగా కరోనా వల్ల ఎటువంటి క్రీడలు జరగలేదు. యూఏఈ లో జరగబోయే ఐపీల్ కోసం క్రికెట్ అభిమానులంతా వేచి చూస్తున్నారు.

Tags :

Advertisement