ప్రొటోకాల్ నిబంధనలే ఐపీఎల్ షెడ్యూలుకు ఆటంకం
By: Dimple Sat, 29 Aug 2020 01:50 AM
దేశం విడిచి... మరో దేశం వెళ్లిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ అంత సులభంగా ఏమీలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిబంధనలు ఐపీఎల్ నిర్వాహకుల్నిహెచ్చరిస్తున్నాయి. ఇంటర్ సిటీ ట్రావెల్ ప్రొటోకాల్ కు సంబంధించిన నిబంధనలు ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు ప్రతిబంధకంగా తయారుకావడంతో బీసీసీఐ అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికార యంత్రాంగాన్ని సంప్రదించి ఐపీఎల్ ఆటగాళ్ల విషయంలో నిబంధనలు సడలించాలని విన్న వించారు.
దుబాయ్ మరియు అబుదాబిలోని రెండు ఎమిరేట్స్లో కోవిడ్ -19 కు సంబంధించిన ప్రత్యేక ప్రోటోకాల్లు ఉన్నాయి. రెండు నగరాల మధ్య ప్రయాణ పరిమితులు ఉన్నాయి. అబుదాబిలోకి ప్రవేశించేటప్పుడు, తప్పనిసరిగా వేగంగా పరీక్షలు చేయించుకోవాలి. ప్రతికూల పరీక్ష తర్వాత మాత్రమే సరిహద్దును దాటవచ్చు. ఇటువంటి కఠినమైన విధానాలు మ్యాచ్ రోజున జట్లకు అడ్డంకిగా మారాయి. ఐపిఎల్ 2020 షెడ్యూల్ను బిసిసిఐ ఇప్పటి వరకు ఖరారు చేయకుండా పోవడానికి ప్రధాన కారణమని సమాచారం.
అబుదాబి ఎమిరేట్స్ బిసిసిఐ జోక్యం తరువాత రెండు ఫ్రాంచైజీలకు నిర్బంధ నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. ఐపిఎల్ ఫ్రాంచైజీలైన కోల్కతా నైట్ రైడర్స్ మరియు అబుదాబికి చెందిన ముంబై ఇండియన్స్కు శిక్షణ ఇవ్వడానికి అనుమతులు పొందింది.
United Arab Emirates Ministry of Culture, Youth, and Social Development శాఖ మంత్రి Sheikh Nahyan bin Mubarak Al Nahyan తన వంతు సమస్య పరిష్కారంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అబుదాబి ఎమిరేట్స్ అధికారులనుంచి ఇంటర్-సిటీ ట్రావెల్ ప్రోటోకాల్స్కు సంబంధించిన సమస్య ఓ కొలిక్కి వచ్చింది. అబుదాబి - దుబాయ్, అబుదాబి - షార్జా మధ్య క్లిష్టమైన ప్రయాణ కార్యకలాపాలకు సంబంధించి ప్రతిష్టంభన తొలగిపోయింది. దీంతో బీసీసీఐ అధికారులు ఐపిఎల్ 2020 షెడ్యూల్ ను విడుదలచేయాలని సంకల్పించారు.
దీంతో అబుదాబిలో ఉన్న ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ దుబాయికి సులభంగా ప్రయాణించే వెసులు బాటు కల్పించారు. కోవిడ్ నిబంధనలను సడలించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రత్యేక చొరవ తీసుకుంది. దీంతో షెడ్యూలును కొన్ని గంటల్లో విడుదల చేయాలనుకుంటున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో కోవిడ్ పాజిటివ్ కలకలం చోటుచేసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీసు మ్యాచులకు రాకుండా... శారీరక వ్యాయామసాధన చేస్తూ... మరో వారం రోజులపాటు నిర్భంద క్వారంటైన్లో ఉండబోతుంది.
దుబాయ్ వేదికలపై ఐపీఎల్ నిర్వహణ సవాళ్లతో కూడుకున్న పనిగా మారింది. ఎదురవుతున్న సవాళ్లు అధిగమిస్తున్నామని దుబాయ్లో ఉంటున్న బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రధానాధికారులు తమవంతు బాధ్యతగా వ్యవహరించి... ఇబ్బందికర పరిస్థితులు తలెత్తనీకుండా.... చర్యలు తీసుకుంటున్నారు. సహాయ సహకారాలు అందిస్తున్నారని సంతృప్తికర సమాచారం అందించారు.
అబుదాబిలోని కోవిడ్ నిబంధనల ప్రకారం, కోల్కతా నైట్ రైడర్స్ , ముంబై ఇండియన్స్ ఇద్దరూ 14 రోజుల నిర్బంధాన్ని పూర్తి చేయవలసి ఉంది, ఆ తర్వాత వారికి శిక్షణ ప్రారంభించడానికి అనుమతి లభిస్తుంది. దుబాయ్ కేంద్రంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, ఇప్పటికే 6 రోజుల తప్పనిసరి నిర్బంధాన్ని పూర్తి చేసిన తరువాత శిక్షణను ప్రారంభించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం మరో వారంపాటు... నిర్భంధ క్వారంటైన్ కొనసాగిస్తోంది.