Advertisement

  • ఐపీయల్ 2020 తొలి మ్యాచ్ పై వీడని సస్పెన్సు ..తాజాగా రేసులోకి వచ్చిన మరో రెండు జట్లు

ఐపీయల్ 2020 తొలి మ్యాచ్ పై వీడని సస్పెన్సు ..తాజాగా రేసులోకి వచ్చిన మరో రెండు జట్లు

By: Sankar Sun, 06 Sept 2020 09:02 AM

ఐపీయల్ 2020 తొలి మ్యాచ్ పై వీడని సస్పెన్సు ..తాజాగా రేసులోకి వచ్చిన మరో రెండు జట్లు


ఈ ఏడాది ఐపీయల్ టోర్నీ ఎన్నడూ లేని అన్ని సస్పెన్సు లతో నడుస్తుంది..ఇప్పటికే కరోనా కారణంగా చాల కాలం వాయిదా పడిన టోర్నీ ..ఇండియాలో కరోనా కేసులు తగ్గకపోవడంతో యూఏఈ కి షిఫ్ట్ అయింది..ఇక అక్కడ ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్న తరుణంలో తొలి మ్యాచ్ ఆడాల్సిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మళ్ళీ బీసీసీఐ ఆలోచనలో పడింది..అయితే చెన్నై ఆటగాళ్లు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ తొలి మ్యాచ్ ఆడుతార లేదా అనే సస్పెన్సు మాత్రం అలాగే కొనసాగుతుంది..

ఈ టోర్నీ సెప్టెంబర్ 19 న ప్రారంభమై నవంబర్ 10 ముగుస్తుంది అని చెప్పిన బీసీసీఐ ఆ మధ్యలో జరగాల్సిన మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రం ప్రకటించడం లేదు. అలాగే మొదటి మ్యాచ్ గురించి కూడా సరైన సమాచారం లేదు..అయితే ఈ రోజు ఐపీయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పోస్ట్ చూస్తే మాత్రం తొలి మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతదో క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తుంది.

ఆ ట్విట్ లో ''ఈ టోర్నీకి ఇంకా 14 రోజులే ఉంది అంటూ కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్ అలాగే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోలను పోస్ట్ చేసింది.'' అంటే తొలిపోరు ఈ రెండు జట్ల మధ్యే జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రోజే ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు

Tags :
|
|
|
|
|

Advertisement