నేడే ఐపీయల్ పూర్తి షెడ్యూల్ విడుదల ..తొలి మ్యాచ్ లో చెన్నై ఆడుతుందా లేదా !
By: Sankar Sun, 06 Sept 2020 06:26 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ షెడ్యూల్ కోసం అటు ఫ్రాంఛైజీలతో పాటు ఇటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీగ్ షెడ్యూల్ను శుక్రవారం విడుదల చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రకటించినప్పటికీ బోర్డు నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. సమయం గడుస్తున్నా షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి.
తాజాగా ఐపీఎల్ మ్యాచ్ల షెడ్యూల్పై ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటన చేశారు. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 షెడ్యూల్ రేపు విడుదల అవుతుందని బ్రిజేశ్ వెల్లడించారు. ఐపీఎల్ 2020 టోర్నీ దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది.
అయితే తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సి ఉంది..కానీ కరోనా కరంగా చెన్నై టీం కు సరైన సాధన కు సమయం లభించలేదు..అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ తాజాగా చేసిన టెస్టుల్లో నెగటివ్ రావడంతో తొలి మ్యాచ్ల్లో బరిలోకి దిగేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సంసిద్దంగానే ఉన్నట్లు తెలుస్తుంది..ఒకవేళ చెన్నై ఆడలేకపోతే ముంబై ఇండియన్స్ తో ఆర్సీబి తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..