ఐపీయల్ నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఐపీయల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్
By: Sankar Fri, 24 July 2020 2:51 PM
గత నాలుగు ఐదునెలలుగా క్రికెట్ మ్యాచ్లు లేక ఎప్పుడెప్పుడు క్రికెట్ నాచులు మొదలవుతాయి అని ఇండియన్ క్రికెట్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు ..అయితే ఇంగ్లండ్లో క్రికెట్ స్టార్ట్ అయినప్పటికీ అది టెస్ట్ మ్యాచ్ కావడంతో అభిమానులకు అంత మాజా ఇవ్వడం లేదు ...అయితే అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) షెడ్యూల్పై స్పష్టత వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా సెప్టెంబర్ 19న లీగ్ ఆరంభంకానుందని నవంబర్ 8న ఫైనల్తో టోర్నీ ముగియనుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిటేష్ పటేల్ శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఈసారి పూర్తిస్థాయి టోర్నమెంట్ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
గవర్నింగ్ కౌన్సిల్ త్వరలోనే సమావేశమై షెడ్యూల్ను ఖరారు చేస్తుంది. లీగ్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు జరుగుతుంది. విదేశాల్లో లీగ్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వ అనుమతి త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. అనుమతి రాగానే పాలక మండలి సమావేశం నిర్వహిస్తాం. ఈసారి ఐపీఎల్ 51 రోజుల పాటు జరగనుందని' బ్రిజేష్ పేర్కొన్నారు.
స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనేది యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా భౌతిక దూరం ప్రతిఒక్కరూ పాటించాల్సిందే. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆ ప్రభుత్వానికి వదిలేశాం. అధికారికంగా యూఏఈ బోర్డుకు కూడా లేఖ రాయనున్నట్లు' పటేల్ తెలిపారు.