IPL 2020 SRH VS KXIP: హైదరాబాద్ మళ్లీ గెలుపు బాట పట్టింది..!
By: Anji Fri, 09 Oct 2020 03:36 AM
ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో దుబాయ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత ఓపెనర్లు జానీ బెయిర్స్టో (97: 55 బంతుల్లో 7x4, 5x6), డేవిడ్ వార్నర్ (52: 40 బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీలు బాదడంతో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్..
అనంతరం స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/12) మాయతో పంజాబ్ని 16.5 ఓవర్లలోనే 132 పరుగులకి ఆలౌట్ చేసింది. పంజాబ్ జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ (77: 37 బంతుల్లో 5x4, 7x7) సంచలన ఇన్నింగ్స్తో కాసేపు సన్రైజర్స్ని కంగారుపెట్టినా..
ఇన్నింగ్స్ 15వ ఓవర్లోనే అతడ్ని ఔట్ చేసిన రషీద్ ఖాన్.. మ్యాచ్ని పూర్తిగా పంజాబ్కి దూరం చేసేశాడు. తాజా సీజన్లో ఆరో మ్యాచ్ ఆడిన హైదరాబాద్కి ఇది మూడో గెలుపుకాగా.. పంజాబ్కి ఇది ఐదో ఓటమి.