కరోనా తో అల్లాడుతున్న దేశం యొక్క మూడ్ ను ఈ ఐపీయల్ మారుస్తుంది ...గౌతమ్ గంభీర్
By: Sankar Sun, 26 July 2020 10:16 AM
ఐపీఎల్-2020 అన్ని సీజన్లోకి హైలైట్గా నిలుస్తుందని మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. ఈ ఐపీఎల్లో ఏ జట్టు టైటిల్ సాధిస్తుంది, ఏ ఆటగాడు బాగా ఆటతాడు అనే విషయానికి అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశం, యావత్ ప్రపంచం కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో జరుగుతున్న క్రికెట్ వేడుక కాబట్టి వేదిక ఎక్కడైనా జోష్ మాత్రం తగ్గదని అన్నారు. ఇక ఐపీఎల్-2020 యూఏఈలో నిర్వహించడం కూడా కలిసి వస్తుందని చెప్పారు. యూఏఈ క్రికెట్ టోర్నీలకు అద్బుతమైన వేదిక అని పేర్కొన్నారు. ఈ సీజన్ జాతి మూడ్ను మారుస్తుందని గంభీర్ ఆకాక్షించారు.
ఇక మార్చి 29న నిర్వహించాల్సిన ఐపీఎల్-2020 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడటంతో.. ఆ సమమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు తాజా ఐపీఎల్ కొనసాగనుంది. ఇక ఐపీఎల్-2020 ని యూఏఈలో నిర్వహిస్తామని ఐపీఎల్ నిర్వహణ కమిటీ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఇదివరకే ప్రకటించారు. టోర్నీకి సంబంధించి పూర్తి వివరాలు వచ్చేవారం వెల్లడికానున్నాయి.
ఇక ధోని రిటైర్మెంట్ పై మాట్లాడిన గంభీర్ ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అని అన్నారు ..తాను టీమిండియా కు మ్యాచ్ గెలిపించగలను అన్ని నమ్మినంత కలం ధోని టీంలో ఉండొచ్చు అని గంభీర్ అన్నారు ..పూర్తి ఫిట్నెస్ ఉంది , ఫామ్లో ఉంటె ధోని టీంలోకి రావొచ్చు అని అన్నారు ..