IPL 2020: నేడు ముంబై వర్సెస్ కోల్కతా..!
By: Anji Wed, 23 Sept 2020 09:20 AM
ఐపీఎల్ 2020 ఆరంభ మ్యాచ్లో కంగుతిన్న డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ రోజు (బుధవారం) రాత్రి 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో జరిగే మ్యాచ్లో రోహిత్సేన.. దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది.
బ్యాటింగ్లో ఇరుజట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ బ్యాట్స్మెన్ మధ్య సమరంగా సాగే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా లాంటి టీమిండియా ఆటగాళ్లతో ముంబై పటిష్ఠంగా కనిపిస్తోంది. మరోవైపు కోల్కతా తమ తొలి మ్యాచ్లోనే నెగ్గి శుభారంభం చేయాలనుకుంటోంది.
ఆ జట్టు యువ ఆటగాడు శుభ్మన్ గిల్పైనే అందరి దృష్టీ నెలకొంది. కాగా, విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ ఆండ్రీ రస్సెల్ టాపార్డర్లో ఆడనుండడం నైట్రైడర్స్కు ప్లస్ కానుంది. బౌలింగ్లో కమిన్స్ పెద్దదిక్కుగా ఉన్నాడు.