IPL 2020: ముంబయి ఇండియన్స్ ఘన విజయం
By: Anji Thu, 24 Sept 2020 06:42 AM
ఐపీఎల్ 2020 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ గెలుపు బోణి అందుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన కనబర్చిన ముంబయి ఇండియన్స్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట కెప్టెన్ రోహిత్ శర్మ (80: 54 బంతుల్లో 3x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన కోల్కతా 146/9కే పరిమితమైంది.
ఆ జట్టులో పాట్ కమిన్స్ (33: 12 బంతుల్లో 1x4, 4x6) టాప్ స్కోరర్కాగా.. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (30: 23 బంతుల్లో 5x4) ఫర్వాలేదనిపించాడు. భారీ అంచనాలతో క్రీజులోకి అడుగుపెట్టిన ఆండ్రీ రసెల్ (11), ఇయాన్ మోర్గాన్ (16) తేలిపోయారు.
Tags :
ipl 2020 |
kkr |
mi |