IPL 2020 MI VS KXIP: ముంబైతో పంజాబ్ కీలక ఫైట్...!
By: Anji Sun, 18 Oct 2020 8:14 PM
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి మరో రసవత్తర మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తాజా సీజన్లో 8 మ్యాచ్లాడిన ముంబై టీమ్ ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేసులో కొనసాగుతుండగా.. 8 మ్యాచ్లు ఆడిన పంజాబ్ టీమ్ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించి చివరి స్థానంలో ఉంది. పంజాబ్ టీమ్ ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే.. ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది.
Tags :
m ashwin |