IPL 2020 KXIP Vs SRH: పంజాబ్పై ఓడిన హైదరాబాద్...!
By: Anji Sun, 25 Oct 2020 04:52 AM
ఐపీఎల్ 2020 సీజన్లో శనివారం సులువుగా గెలవాల్సిన మ్యాచ్ని సన్రైజర్స్ హైదరాబాద్ పేలవరీతిలో వికెట్లు చేజార్చుకుని ఓడిపోయింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 127 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించలేక 114 పరుగులకే ఆలౌటైంది.
దాంతో.. 12 పరుగుల తేడాతో మ్యాచ్లో గెలుపొందిన పంజాబ్ టీమ్.. 11 మ్యాచ్లకిగానూ ఐదో విజయంతో ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగా.. హైదరాబాద్ ఏడో ఓటమితో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.
Tags :
ipl 2020 |