IPL 2020 KXIP Vs SRH: రసవత్తరమైన పోరు జరుగుతోంది..!
By: Anji Sat, 24 Oct 2020 8:40 PM
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా ఈ శనివారం రాత్రి రసవత్తరమైన పోరు జరుగుతోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి.
మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్లాడిన సన్రైజర్స్ నాల్గింటిలో మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది.
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే సన్రైజర్స్ ఈ మ్యాచ్లో తప్పక నెగ్గాలి. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పరిస్థితి కూడా అలానే ఉంది. 10 మ్యాచ్లాడి నాల్గింటిలో గెలుపొందింది.
Tags :