ఐపీఎల్ 2020లో హైదరాబాద్ గెలుపు...
By: chandrasekar Wed, 30 Sept 2020 3:05 PM
ఐపీఎల్ 2020లో సన్రైజర్స్
హైదరాబాద్ ఎట్టకేలకి మూడవ మ్యాచ్ లో గెలిచింది. తొలి రెండు మ్యాచ్ల్లోనూ
ఘోరంగా ఓడిన హైదరాబాద్ అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో
మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో
ఓపెనర్ జానీ బెయిర్స్టో (53: 48 బంతుల్లో 2x4,
1x6) హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్
హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగా ఛేదనలో రషీద్ ఖాన్ (3/14) దెబ్బకి ఒత్తిడికి గురైన ఢిల్లీ క్యాపిటల్స్ 147/7కే పరిమితమైంది.
ఛేదన ఆరంభంలోనే పృథ్వీ షా
(2)ని
బోల్తా కొట్టించి ఢిల్లీ క్యాపిటల్స్కి భువనేశ్వర్ కుమార్ షాకివ్వగా మరో ఓపెనర్
శిఖర్ ధావన్ (34: 31 బంతుల్లో 4x4)తో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (17: 21 బంతుల్లో 2x4), హిట్టర్ రిషబ్ పంత్ (28: 27 బంతుల్లో 1x4, 2x6) వికెట్లను రషీద్ ఖాన్ వరుస విరామాల్లో అవుట్ చేసాడు. దాంతో.. ఢిల్లీ టీమ్ పూర్తిగా
ఒత్తిడిలోకి వెళ్లిపోగా ఆఖర్లో హిట్మెయర్ (21:
12 బంతుల్లో 2x6)
కాస్త కంగారుపెట్టాడు. కానీ అతడ్నీ బోల్తా కొట్టించిన
భువనేశ్వర్ మ్యాచ్ని పూర్తిగా సన్రైజర్స్ వైపుకి మలిచాడు. చివర్లో కగిసో రబాడ (15: 7
బంతుల్లో 1x4, 1x6) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించగా స్టాయినిస్ (11: 9
బంతుల్లో 1x4) అంచనాల్ని అందుకోలేకపోయాడు. మొత్తంగా సమష్టిగా
రాణించిన హైదరాబాద్ బౌలర్లు ఢిల్లీని చేజింగ్ చేయకుండా కట్టడి చేసారు.