మరికొద్ది సేపట్లో ఐపీయల్ 2020 ఫైనల్... ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
By: Sankar Tue, 10 Nov 2020 5:49 PM
నెల రోజులగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న వచ్చిన ఐపీఎల్ నేడు చివరి గట్టానికి చేరుకుంది..ఎన్నో అంచనాలు..మరెన్నో అవాంతరాలు దాటుకొని స్టార్ట్ అయిన ఐపీఎల్ ఫైనల్కు చేరింది..బంతికి బంతికి మారిన ఆధిపత్యాలు, సూపర్ ఓవర్ల పోరాటం ఇలా ఎన్నో మలుపులతో జరిగిన ఈ ఐపీఎల్ సీజన్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చింది..
నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఒకవైపు... పదమూడో ప్రయత్నంలో ఫైనల్ చేరి మొదటి ఐపీఎల్ టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు పోరుకు ‘సై’ అంటున్నాయి. మైదానంలో ప్రేక్షకులు లేకపోయినా... టీవీ వీక్షకుల ఆనందానికి ఏమాత్రం లోటు రాకుండా సాగిన ఈ సీజన్ ఐపీఎల్కు మరో అద్భుత ముగింపు లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఎదురుపడ్డ మూడుసార్లు ఢిల్లీని చిత్తు కింద కొట్టిన ముంబై నాలుగోసారి కూడా అదే రిపీట్ చేయాలని తహతహలాడుతుంటే.. సీన్ రివర్స్ చేసి తొలిసారి టైటిల్ పట్టాలని ఢిల్లీ దృఢనిశ్చయంతో ఉంది. ఈసారి ఐపీఎల్లో ప్రైజ్మనీని భారీగా తగ్గించారు. చాంపియన్గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ఇవ్వనున్నారు. గత ఏడాది విజేత జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. ఈసారి రన్నరప్ జట్టుకు రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతాయి.