IPL 2020 CSK Vs KXIP : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ...!
By: Anji Sun, 01 Nov 2020 3:37 PM
ఐపీఎల్-13వ సీజన్ ప్లేఆఫ్ రేస్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ మిగతా జట్ల ఆశలకు దెబ్బకొడుతోంది.
ప్లేఆఫ్ రేసులో ఉన్న కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చెన్నైతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్లో చెన్నైపై గెలిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్ రేసులో ఉంటుంది. సీజన్లో తమ ఆఖరి మ్యాచ్ను ఘనంగా ముగించాలని ధోనీసేన భావిస్తోంది.
టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. షేన్ వాట్సన్, సాంట్నర్, కర్ణ్ శర్మ స్థానంలో డుప్లెసిస్, తాహిర్, శార్దుల్ ఠాకూర్లను తుది జట్టులోకి తీసుకున్నట్లు ధోనీ చెప్పాడు.
వరుసగా విఫలమవుతున్న మాక్స్వెల్ స్థానంలో జేమ్స్ నీషమ్, అర్షదీప్ స్థానంలో మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నట్లు పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ వివరించాడు.
చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్), జగదీశన్, రవీంద్ర జడేజా, సామ్కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్
పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్గేల్, నికోలస్ పూరన్, మన్దీప్ సింగ్, జేమ్స్ నీషన్, దీపక్ హూడా, క్రిస్జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవిబిష్ణోయ్, మహ్మద్ షమి