Advertisement

IPL 2020: ఢిల్లీ కేపిటల్స్‌కు పెద్ద షాక్...!

By: Anji Tue, 06 Oct 2020 08:12 AM

IPL 2020: ఢిల్లీ కేపిటల్స్‌కు పెద్ద షాక్...!

తాజా ఐపీఎల్ టోర్నీలో దూసుకుపోతున్న ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టులో మోస్ట్ డిపెండబుల్ బౌలర్‌గా భావిస్తున్న లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయంతో మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కేపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.

లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గత శనివారం షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో బౌలింగ్ వేళ్ళలోని నరాలు దెబ్బతిన్నాయి. ఆదివారం అమిత్ మిశ్రాకు స్కానింగ్ నిర్వహించామని నరాలు దెబ్బతినడంతో కొంతకాలం పాటు మిశ్రా బౌలింగ్ చేయలేడని వైద్యులు తెలిపారని ఢిల్లీ కేపిటల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

‘‘నిజానికి కోల్‌కతా నైట్‌రైడ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మిశ్రా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడు అతనికి ప్రత్యామ్నాయం వెతకడం కష్టమైన పని.. ఇది నిజంగా మా జట్టుకు షాకే’’ అని డీసీ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.

Tags :

Advertisement