Advertisement

IPL 2020: ఈ మ్యాచ్‌ను 20 కోట్ల మంది వీక్షించారంట..!

By: Anji Tue, 22 Sept 2020 5:01 PM

IPL 2020: ఈ మ్యాచ్‌ను 20 కోట్ల మంది వీక్షించారంట..!

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈనెల 19న ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో టోర్నీకి తెరలేచింది. కరోనా కారణంగా పలు వాయిదాల తర్వాత క్లోజ్‌డ్ డోర్స్ మధ్య ప్రారంభమైన ఈ టోర్నీలోని తొలి మ్యాచ్ రికార్డులకెక్కింది.

19న చెన్నై-ముంబై జట్ల మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారట. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సీజన్‌లోనూ ఆరంభ మ్యాచ్‌కు ఇంత వ్యూయర్‌షిప్ రాలేదట. ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 20 కోట్ల మంది వీక్షించినట్టు బీసీసీఐ కార్యదర్శి జే షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అంతేకాదు, ప్రపంచంలో మరే లీగ్‌కూ ఇంతటి ఆదరణ దక్కలేదని పేర్కొన్నారు. రోహిత్‌శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌తో జరిగిన ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Tags :

Advertisement