ఐపీయల్ పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల..తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యనే
By: Sankar Sun, 06 Sept 2020 8:18 PM
ఎట్టకేలకు ఐపీయల్ సీజన్ 13 షెడ్యూల్ విడుదల అయింది..కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఐపీయల్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ ప్రారంభం కానుంది..ఈ రోజు ఈ ఐపీయల్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది..
యూఏఈ వేదికగా జరగనున్న డ్రీమ్ 11 ఐపీఎల్లో.. సెప్టెంబర్ 19న అబుదాబిలో ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 20న దుబాయ్లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్, 21న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు, 22న రాజస్థాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, 23న కోల్కతా వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 3 వరకు ఐపీఎల్ 13 వ సీజన్ కొనసాగుతుంది.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో తొలి మ్యాచ్ లో చెన్నై బరిలో దిగుతుందా లేదా అని అభిమానులు ఎన్నడూ లేనంత స్థాయిలో ఐపీయల్ షెడ్యూల్ కోసం ఎదురు చూసారు..అయితే పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు అందరికి నెగటివ్ రావడం , ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడంతో తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తో రన్నర్ అప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడటం ఖరారు అయింది..