Advertisement

  • భారత్ లో ప్రారంభమైన ఐఫోన్ తయారీ... అందుబాటు ధరలో అమ్మకాలు

భారత్ లో ప్రారంభమైన ఐఫోన్ తయారీ... అందుబాటు ధరలో అమ్మకాలు

By: chandrasekar Mon, 31 Aug 2020 10:59 AM

భారత్ లో ప్రారంభమైన ఐఫోన్ తయారీ... అందుబాటు ధరలో అమ్మకాలు


కరోనా కారణంగా చైనా నుండి భారత దేశానికీ తన కంపెనీ ని మార్చిన ఐఫోన్ ఇక్కడ తయారీని ప్రారంభించింది. యాపిల్ తన బడ్జెట్ ఫోన్ ఐఫోన్ ఎస్ఈ(2020) ఉత్పత్తిని మనదేశంలో ప్రారంభించింది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయిన నాలుగు నెలల తర్వాత మనదేశంలో ఉత్పత్తి ప్రారంభం అయింది. ఐఫోన్ ఎస్ఈ(2020) ఉత్పత్తి కర్ణాటకలోని విస్ట్రోన్ ఫెసిలిటీలో ప్రారంభం అయింది. దీని కారణంగా యాపిల్ కు 20 శాతం దిగుమతి సుంకం తగ్గనుంది.

ఐఫోన్ ఎస్ఈ(2020) మాత్రమే కాకుండా యాపిల్ మరో ఐదు ఐఫోన్ మోడళ్లను కూడా మనదేశంలో రూపొందిస్తుంది. అయితే మనదేశంలో తయారైన ఐఫోన్ ఎస్ఈ(2020) సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో తెలియరాలేదు. అయితే ఇంతకుముందు ఫోన్లను చూస్తే అతి త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఐఫోన్ పై తగ్గింపు కూడా లభించే అవకాశం ఉంది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ ఈ అంశంపై స్పందిస్తూ మనదేశంలో వీటిని తయారు చేయడం కారణంగా ఖర్చు తగ్గి తద్వారా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని తెలిపారు. ఇందువల్ల మనకు తక్కువ ధరలో ఐఫోన్ లభ్యమవుతుంది.

ఎస్ఈ(2020) మనదేశంలో తయారయ్యే ఆరో ఐఫోన్. ఐఫోన్ ఎస్ఈ పాత మోడల్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ ల ఉత్పత్తి కూడా ఇక్కడే జరుగుతోంది. ఐఫోన్ 11 ఉత్పత్తి కూడా ఇందులో ప్రారంభం కావడం విశేషం. ఐఫోన్ 12 ఉత్పత్తిని కూడా 2021లో మనదేశంలో ప్రారంభించే ఆలోచనలో కంపెనీ ఉంది. ఐఫోన్ ఎస్ఈ(2020) మనదేశంలో ఈ సంవత్సరం ఏప్రిల్ లో లాంచ్ అయింది. దీని ధర రూ.42,500 నుంచి ప్రారంభం అయింది. 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఐఫోన్ 11 సిరీస్ లో అందించిన యాపిల్ ఏ13 బయోనిక్ చిప్ నే ఇందులో కూడా అందించారు. ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్ డీ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో హాప్టిక్ టచ్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్ ను అందించారు. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎల్ఈడీ ట్రూటోన్ ఫ్లాష్, స్లో సింక్ ఫీచర్లు కూడా ఇందులో ఉండటం విశేషం. ఇప్పుడు ఇక్కడే ఉత్పత్తి ప్రారంభించడం వల్ల ధరలు కూడా తగ్గవచ్చని తెలిసింది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై 802.11ax, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ బటన్ ను అందించారు. ఈ ఐఫోన్ ఎస్ఈ 2020 సెప్టెంబర్ 2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8 డిజైన్ లో ఉంది. ఐఫోన్ ఎస్ఈ 2020 పొడవు 13.84 సెంటీమీటర్లుగా ఉండగా, వెడల్పు 6.73 సెంటీమీటర్లుగానూ, మందం 0.73 సెంటీమీటర్లుగానూ ఉంది. దీని బరువు కూడా 148 గ్రాములు మాత్రమే ఉంది. ఐఫోన్ కంటూ ఒక ప్రత్యేకత వుంది. అందువల్ల ధరలు ఎక్కువగా వున్నా కూడా ఈ ఫోన్ ను కొనడంలో జనాలు ఉత్సాహాన్ని చూపుతారు.

Tags :
|
|
|

Advertisement