ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్
By: chandrasekar Thu, 28 May 2020 3:52 PM
కరోనా లాక్ డౌన్ కారణంగా
ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్
వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో రిజల్ట్స్
రిలీజ్ చేయాలని ఇంటర్ బోర్డు
భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా
టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ తో పాటు ఓంఎంఆర్ స్కానింగ్ ప్రాసెస్ కూడా కొనసాగుతోంది. అయితే
ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వేర్వురుగా ఇవ్వాలా? ఒకేసారి ఇవ్వాలా? అనే
దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇంటర్ సెకండియర్
వాల్యుయేషన్ మూడు రోజుల క్రితమే
పూర్తయింది. ప్రస్తుతం ఓఎంఆర్ పార్ట్
3 స్కానింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఫస్టియర్ ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథ్స్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ పేపర్లు
దిద్దడం కూడా పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. రిజల్ట్స్ ప్రాసెస్ ను
వారం, పది రోజుల్లో పూర్తి చేయనున్నారు.
గతంలో ముందు సెకండియర్
రిజల్ట్స్ ఇచ్చి, వారం తర్వాత ఫస్టియర్ రిజల్ట్స్ ఇవ్వాలని అధికారులు అనుకున్నారు. కానీ వాల్యుయేషన్ ప్రాసెస్ త్వరగా ముగియడంతో, ఫస్టియర్, సెకండియర్
రిజల్ట్స్ ఒకేసారి ఇవ్వడంపై ఆలోచన
చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వపెద్దలతో చర్చించిన తర్వాతే ఇంటర్ బోర్డు నిర్ణయం
తీసుకునే అవకాశముంది.
ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియ ఈ నెలాఖరులో పూర్తవుతుంది. ప్రస్తుతం
రెండు, మూడు సబ్జెక్టుల వాల్యుయేషన్ కొనసాగుతోంది. వాల్యుయేషన్ తో సమాంతరంగా ఓఎంఆర్ స్కానింగ్
ప్రక్రియ జరుగుతోంది. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రతలు
తీసుకుంటున్నాం. జూన్ ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ ప్రాసెస్ పూర్తి చేసి, రెండోవారంలో
ఫలితాలు విడుదల చేస్తాం. – ఉమర్ జలీల్, ఇంటర్
బోర్డు సెక్రెటరీ.