నరేంద్ర మోడీ, విరుష్క జోడీ మధ్య ఆసక్తికర ట్వీట్స్
By: chandrasekar Sat, 19 Sept 2020 12:02 PM
గురువారం (సెప్టెంబరు 17) భారత
ప్రధాని నరేంద్ర మోడీ 70వ పుట్టిన రోజు జరుపుకున్న నరేంద్ర మోడీకి టీమిండియా
కెప్టెన్ విరాట్ కోహ్లీ విషెష్ చెప్పాడు. దానికి రిప్లై ఇచ్చిన మోడీ కోహ్లీకి
థ్యాంక్స్ చెప్పడంతో పాటు మీ దంపతులు అద్భుతమైన తల్లిదండ్రులు అవుతారంటూ ఆశీర్వదించారు.
దాంతో ప్రధానికి విరాట్-అనుష్క జోడీ
థ్యాంక్స్ చెప్పింది. 2017 చివర్లో విరాట్ కోహ్లీ, అనుష్క
శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోగా వచ్చే ఏడాది జనవరిలో తాము ముగ్గురం కాబోతున్నట్లు
సోషల్ మీడియా ద్వారా విరుష్క జోడీ ప్రకటించింది.
దాంతో.. క్రికెట్, సినీ
ప్రముఖులు ఈ జంటకి అభినందనలు తెలపగా తాజాగా ప్రధాని తన వంతుగా విరాట్-అనుష్క
జోడీని ఆశీర్వదించారు. అప్పట్లో విరాట్-అనుష్క జోడీ తమ వివాహ విందుకి స్వయంగా
వెళ్లి మోడీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి
నవంబరు 10 వరకూ
ఐపీఎల్ 2020 సీజన్
మ్యాచ్లు జరగనుండగా విరాట్ కోహ్లీతో కలిసి అక్కడికి అనుష్క శర్మ వెళ్లింది.
తల్లిదండ్రులు కాబోతున్న సందర్భంగా ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్తో కలిసి
విరుష్క జోడీ పార్టీ చేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.