Advertisement

  • రేణిగుంట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం...ఎమ్మెల్యేను ఆటపట్టించిన సీఎం జగన్

రేణిగుంట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం...ఎమ్మెల్యేను ఆటపట్టించిన సీఎం జగన్

By: chandrasekar Thu, 24 Sept 2020 12:59 PM

రేణిగుంట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం...ఎమ్మెల్యేను ఆటపట్టించిన సీఎం జగన్


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నో వివాదాల తరువాత తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, అదనపు ఈవో ఆయనకు సాదర స్వాగతం పలికారు. కాసేపట్లో అన్నమయ్య భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. అంతకు ముందు ఢిల్లీ పర్యటన ముగించుకుని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని సీఎం జగన్ ఆటపట్టించారు. సీఎం జగన్‌కు ఆహ్వానం పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె పవిత్ర ఆయన ఫొటో తీయించుకునేందుకు ప్రయత్నించారు. అయితే తండ్రీకూతుళ్లు ఇద్దరూ మాస్క్ ధరించి ఫొటోకు ఫోజిచ్చారు. దీంతో సీఎం జగన్ ఎమ్మెల్యేను ఆటపట్టించినట్లుగా తెలుస్తోంది.

ముఖాలు కనిపించకుండా మాస్క్‌తో ఫొటో తీయించుకుంటే ఏం ఉపయోగం సామీ అంటూ సీఎం జగన్ తనదైన శైలిలో అన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంగణంలో నవ్వులు చిందాయి. వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే, ఆయన కుమార్తె పవిత్ర చిరునవ్వు చిందిస్తూ సీఎం జగన్‌తో ఫొటో తీయించుకున్నారు. సీఎం జగన్ తిరుమల పర్యటన అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో సీఎం జగన్ మాత్రం ఏమీ జరగనట్లు కూల్ కనిపించడం విశేషం. ఓవైపు తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్‌పై వివాదం నడుతున్న తరుణంలో ఆయన మాత్రం సరదాగా అందరితో కలిసి తన పర్యటన చేయడం గమనార్హం.

Tags :

Advertisement