అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు రంగం సిద్ధం: జగన్ సర్కార్
By: chandrasekar Sat, 06 June 2020 11:12 AM
లాక్డౌన్ నిబంధనల
సడలింపుతో ఈ నెల 8వ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు
రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బస్సు సర్వీసుల్ని అనుమతించాలంటూ
పొరుగు రాష్ట్రాలను కోరింది. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు.
కరోనా కేసుల సంఖ్య
ఎక్కువగా ఉండటంతో తమిళనాడుకు మాత్రం లేఖ రాయలేదు. దీనికి తగ్గట్లుగా ఏపీఎస్
ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పొరుగు
రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బస్సులు రోడ్డెక్కనున్నాయి. తెలంగాణ నుంచి
ప్రైవేట్ వాహనాల్లో సరిహద్దులకు భారీగా ప్రైవేట్ వాహనాలు వస్తున్నాయి. అక్కడ
తనిఖీలు, స్క్రీనింగ్
చేసి, వారి
వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాల సేకరణ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీని వలన అంతర్రాష్ట్ర
బస్సు సర్వీసులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్ డౌన్–4
నిబంధనల మినహాయించడంతో తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి రావడానికి దరఖాస్తు చేసుకున్నారు.
వీరి కోసం బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు సిద్ధం చేయగా తెలంగాణ
సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంతర్రాష్ట్ర
ప్రయాణికులను తెలంగాణ అనుమతించినా కానీ స్పష్టమైన విధానం లేదు.
దీని వలన అంతర్రాష్ట్ర
బస్సు సర్వీసులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్ డౌన్–4
నిబంధనల మినహాయించడంతో తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి రావడానికి దరఖాస్తు చేసుకున్నారు.
వీరి కోసం బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు సిద్ధం చేయగా తెలంగాణ
సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంతర్రాష్ట్ర
ప్రయాణికులను తెలంగాణ అనుమతించినా కానీ స్పష్టమైన విధానం లేదు.