Advertisement

తెలంగాణాలో మరొక కీలక పరీక్షలు రద్దు ..

By: Sankar Thu, 09 July 2020 6:54 PM

తెలంగాణాలో మరొక కీలక పరీక్షలు రద్దు ..



తెలంగాణాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యం లో తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ..ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యా్ర్థులందరినీ పాస్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.

కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్య్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇపుడు పాసైన వారందరినీ కంపార్ట్ మెంట్లలో పాసైనట్టుగా గుర్తించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో1.47 లక్షల మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. ఈ మేరకు విద్యార్థులకు జులై 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో మార్కుల మెమోలు జారీచేస్తారని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణాలో పదవ తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే ..అయితే ఇంటర్ ఎగ్జామ్స్ మాత్రం కరోనా విజృంభణకు ముందే పూర్తి అయ్యాయి ..అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్లి పరీక్షలు నిర్వహించడం అంటే వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమే అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

Tags :
|
|

Advertisement