Advertisement

  • సిద్ధిపేట జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా కారు

సిద్ధిపేట జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా కారు

By: Sankar Mon, 17 Aug 2020 11:16 AM

సిద్ధిపేట జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఇన్నోవా కారు


సిద్ధిపేట జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. నంగునూరు మండలం దర్గపల్లి మధ్యలో ఉన్న వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది.

ఈ ప్రమాదంలో ముగ్గురుని ఎస్ఐ అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. స్థానికుల కథనం మేరకు.. వీరంతా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు. మంతిని దగ్గర ఇసుక క్వారీలో సూపర్ వైజర్స్ గా పనిచేస్తున్నారు.

కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున క్వారీలోకి నీళ్లు రావడంతో అందరూ కలిసి తమ ఇండ్లళ్లకు పోదామని కారులో బయలుదేరారు. వరద ఉధృతిని అంచనా వేయలేకపోడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి సీపీ జోయల్ డెవిస్ చేరుకొని పరిస్థిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :
|
|
|

Advertisement