Advertisement

  • డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆఫర్‌

డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆఫర్‌

By: chandrasekar Fri, 03 July 2020 11:03 AM

డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆఫర్‌


డాక్టర్లకు, నర్సులకు ప్రయాణ ఛార్జీల్లో 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. కరోనా వైరస్‌ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ముందంజలో ఉండి పోరాడుతున్నందున వీరికి ఈ ఏడాది చివరి వరకు విమాన ఛార్జీలపై రాయితీలు కల్పిస్తునట్లు పేర్కొంది.

నర్సులు, వైద్యులు చెక్‌ ఇన్‌ సమయంలో వారి గుర్తింపును, ఆస్పత్రి ఐడీలను అందించాల్సి ఉంటుందని తెలిపింది. ఇండిగో వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసేటప్పుడు కూడా డిస్కౌంట్‌ ఇవ్వబడుతుందని తెలిపింది. ఈ ఆఫర్‌ ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రెండు నెలల విరామం తర్వాత మే 25న విమానాలు తిరిగి తమ సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దేశీయ విమానాల్లో ప్రయాణీకుల రవాణా తక్కువగా ఉంటూ వస్తుంది. విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి స్పందిస్తూ జులై 1న 785 విమానాల్లో 71,471 మంది ప్రయాణికులు ప్రయాణించారన్నారు. అంటే సగటున ఒక విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. దేశంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేదం ఇంకా అమలులో ఉంది.

Tags :
|

Advertisement