భారతీయ ఇన్ఫ్రా కంపెనీలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పోటీ
By: chandrasekar Fri, 25 Sept 2020 12:11 PM
పలు భారతీయ ఇన్ఫ్రా
కంపెనీలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం పనులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా లార్సెన్
అండ్ టుబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా
ప్రాజెక్ట్స్, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సహా ఏడు పెద్ద
మౌలిక సదుపాయాల సంస్థలు రంగంలో నిలిచాయి.
కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్
ను తొలుత ముంబై-అహ్మదాబాద్ మధ్య చేపట్టేందుకుగ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుల్లెట్
ట్రైన్ ప్రాజెక్టును నిర్మిస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్
లిమిటెడ్ అహ్మదాబాద్-ముంబై కారిడార్
రూపకల్పన, నిర్మాణ
పనుల కోసం దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడితో కూడిన మొదటి టెండర్కు
బిడ్లను తెరిచింది.
గుజరాత్లో ఉండే 237
కిలోమీటర్ల మెయిన్లైన్ కోసం బిడ్డర్లు అన్నీ మెగా ఇండియన్ కంపెనీలే కావడం విశేషం.
గుజరాత్లోని వాపి, వడోదర మధ్య మొత్తం అమరికలో 47 శాతం
టెండర్ వర్తిస్తుంది. ఇందులో వాపి, బిల్లిమోరా, సూరత్, భరూచ్ సహా నాలుగు స్టేషన్లు ఉన్నాయి. అలాగే ఒక నది, 30 రోడ్
క్రాసింగ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 83 శాతానికి పైగా భూమిని
స్వాధీనం చేసుకున్నట్లు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. పోటీ
బిడ్డింగ్లో ఏడు మౌలిక సదుపాయాల మేజర్లతో ముగ్గురు బిడ్డర్లు పాల్గొన్నారు. వీటిలో
రెండు కన్సార్టియంలు, అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్-ఇర్కాన్
ఇంటర్నేషనల్-జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్, ఎన్సీసీ-టాటా
ప్రాజెక్ట్-జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎల్ అండ్ టి సంస్థలు ఉన్నాయి.