ప్రధాని మోదీ విధానాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించి౦ది: రాహుల్ గాంధీ
By: chandrasekar Thu, 12 Nov 2020 4:39 PM
భారత ఆర్థిక వ్యవస్థపై
ఆర్బీఐ నివేదిక ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్
ఎంపీ రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్పై ఫైర్ అయ్యారు.
ప్రధాని మోదీ అనుసరిస్తున్న
విధానాల వల్లే భారత ఆర్థిక వ్యవస్థ క్షీణించినట్లు ఆయన ఆరోపించారు.
భారత్ తొలిసారి
మాంద్యంలోకి ప్రవేశించిందని, మోదీ చర్యల వల్ల దేశంలోని బలాలన్నీ బలహీనతలుగా
మారినట్లు రాహుల్ తన ట్విట్టర్లో విమర్శించారు.
దేశ జీడీపీ రెండవ
క్వార్టర్లో మైనస్ 8.6 శాతానికి క్షీణించనున్నట్లు ఆర్బీఐ తన నౌకాస్ట్
నివేదికలో వెల్లడించింది. దీనిపైనే
రాహుల్ కామెంట్ చేశారు.
Tags :
indian |
economy |
weakens |