Advertisement

  • ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో క్రమంగా తమ స్థానాల్ని కోల్పోతున్న భారత క్రికెటర్లు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో క్రమంగా తమ స్థానాల్ని కోల్పోతున్న భారత క్రికెటర్లు

By: chandrasekar Wed, 19 Aug 2020 12:32 PM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో క్రమంగా తమ స్థానాల్ని కోల్పోతున్న భారత క్రికెటర్లు


ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య సౌథాంప్టన్ వేదికగా సోమవారం రెండో టెస్టు డ్రాగా ముగియగా ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌ని ప్రకటించింది. ఆ రెండో టెస్టులో 4 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 846 పాయింట్లతో మూడు నుంచి రెండుకి ఎగబాకాడు. అలానే మూడు వికెట్లు పడగొట్టిన జేమ్స్ అండర్సన్ కూడా రెండు స్థానాలు పైకి ఎగబాకి 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇక పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు సాధించడం ద్వారా రెండు స్థానాలు పైకి ఎగబాకగా భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 779 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయాడు. నిన్నటి వరకూ బుమ్రా 8వ స్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 798 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా పాక్ నుంచి అతను ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 886 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా స్టీవ్‌స్మిత్ 911 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు.

భారత్‌కే చెందిన చతేశ్వర్ పుజారా (766), అజింక్య రహానె (726) టాప్-10లో తమ స్థానాల్ని నిలబెట్టుకోగలిగారు. ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌‌కి వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో కేవలం 134.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ 236 పరుగులకి ఆలౌటవగా.. ఆటలో ఆఖరి రోజైన సోమవారం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ని 110/4తో డిక్లేర్ చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకి అంగీకరించారు.

Tags :
|

Advertisement