నాలుగు రోజులపాటు భారత సైన్యం కమాండర్లు సమావేశం
By: chandrasekar Mon, 26 Oct 2020 1:11 PM
భారత్ మరియు చైనా
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం వల్ల మన దేశ కమాండర్లు స్థాయిలో
సమావేశం జరగనుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం కమాండర్లు
సమావేశం కానున్నారు. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.
ఈనెల 29 వరకు
జరగనున్న సమావేశాల్లో ఆర్మీ ఉపఅధిపతి, కమాండర్లు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు.
శీతాకాలం రానున్న
సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో తీసికోవలసిన జాగ్రత్తలు గురించి చర్చించనున్నట్లు
తెలుస్తుంది. ఈ సందర్భంగా సరిహద్దుల్లోని తూర్పు లఢక్లో తాజా పరిస్థితులు, వ్యయాల
తగ్గింపునకు వస్తున్న ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇవాళ మానవ వనరుల
అంశంపై చర్చించనున్నామని అధికారులు తెలిపారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్
సింగ్ కూడా పాల్గొంటున్నారని వెల్లడించారు. ఆయన రేపు ప్రసంగిస్తారని
చెప్పారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక కమాండ్ల భేటీకి
ప్రాధాన్యం సంతరించుకున్నది.