Advertisement

  • క్రికెట్ అభిమానులకు శుభవార్త ..లాక్ డౌన్ ముగిసిన తర్వాత తొలి సిరీస్ ఆ దేశంలోనే ..?

క్రికెట్ అభిమానులకు శుభవార్త ..లాక్ డౌన్ ముగిసిన తర్వాత తొలి సిరీస్ ఆ దేశంలోనే ..?

By: Sankar Wed, 10 June 2020 7:31 PM

క్రికెట్ అభిమానులకు శుభవార్త ..లాక్ డౌన్ ముగిసిన తర్వాత తొలి సిరీస్ ఆ దేశంలోనే ..?

భారత్‌లో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకి వెళ్లేందుకు టీమిండియా అంగీకరించింది. మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్.. కరోనా వైరస్ కారణంగా మధ్యలోనే రద్దవగా.. అప్పటి నుంచి భారత క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. మళ్లీ గేమ్ టచ్‌లోకి వచ్చేందుకు ఆటగాళ్లకి కనీసం 4-6 వారాలు ప్రాక్టీస్ అవసరమని కోచ్‌లు చెప్తున్నారు.

భారత్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించిన కేంద్ర ప్రభుత్వం.. జులైలో మరిన్ని వెసులబాటుల్ని కల్పించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. టీమిండియా క్రికెటర్లందరూ కొన్ని రోజులు పాటు ఒకే చోట ప్రాక్టీస్ చేసి.. తర్వాత శ్రీలంక పర్యటనకి వెళ్లనున్నారు. భారత్‌తో పోలిస్తే శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు తక్కువగా ఉండటంతో.. స్టేడియంలోకి కూడా అభిమానుల్ని అనుమతించే అవకాశాల్ని శ్రీలంక క్రికెట్ బోర్డు పరిశీలిస్తోంది.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ నెలలోనే శ్రీలంక పర్యటనకి భారత్ వెళ్లాల్సింది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్‌ రూపొందించారు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆగస్టులో అక్కడికి వెళ్లనున్న భారత్ .. 3 వన్డేలు, 3 టీ20 ఆడేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబరులో జరగనున్న ఆసియా కప్ 2020కి కూడా శ్రీలంకనే ఆతిథ్యమివ్వనుండటంతో.. ఈ టూర్‌ టీమిండియాకి కలిసిరానుంది.

Tags :
|
|

Advertisement