Advertisement

ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన షెడ్యూల్...

By: chandrasekar Thu, 19 Nov 2020 2:57 PM

ఇంగ్లండ్‌లో భారత్‌ పర్యటన షెడ్యూల్...


కరోనా కష్టకాలంలో క్రికెట్‌ను పునరుద్ధరించి తొలిసారి బయో బబుల్‌లో సిరీస్‌లు నిర్వహించడంలో విజయవంతమైన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వచ్చే ఏడాది భారత పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

బుధవారం ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు ఆతిథ్యమివ్వనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటిలోపు కరోనా ప్రభావం ఉండకపోతే ప్రేక్షకుల మధ్యే ఈ సిరీస్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది.

ఆగస్టు 4న ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టుతో ప్రారంభమయ్యే ఈ సిరీస్ సెప్టెంబర్‌ 10 మాంచెస్టర్‌ మ్యాచ్‌తో పూర్తి కానుంది. కాగా ఇంగ్లండ్‌ జట్టు 16 ఏండ్ల తర్వాత వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో పర్యటించబోతుంది.

Tags :
|
|

Advertisement