ఇంగ్లండ్లో భారత్ పర్యటన షెడ్యూల్...
By: chandrasekar Thu, 19 Nov 2020 2:57 PM
కరోనా కష్టకాలంలో
క్రికెట్ను పునరుద్ధరించి తొలిసారి బయో బబుల్లో సిరీస్లు నిర్వహించడంలో
విజయవంతమైన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
వచ్చే ఏడాది భారత పర్యటన షెడ్యూల్ను ఖరారు చేసింది.
బుధవారం
ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఐదు టెస్టుల సిరీస్కు ఆతిథ్యమివ్వనున్నట్లు స్పష్టం
చేసింది. అప్పటిలోపు కరోనా ప్రభావం ఉండకపోతే
ప్రేక్షకుల మధ్యే ఈ సిరీస్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది.
ఆగస్టు 4న
ట్రెంట్బ్రిడ్జ్ టెస్టుతో ప్రారంభమయ్యే ఈ సిరీస్ సెప్టెంబర్ 10 మాంచెస్టర్ మ్యాచ్తో
పూర్తి కానుంది. కాగా ఇంగ్లండ్ జట్టు 16 ఏండ్ల తర్వాత వచ్చే ఏడాది పాకిస్థాన్లో
పర్యటించబోతుంది.
Tags :
india |
tour |
schedule |