భారత్ - శ్రీలంక సంయుక్త౦గా నావికా దళ విన్యాసాలు...
By: chandrasekar Tue, 20 Oct 2020 5:57 PM
భారత నావికా దళం (ఐఎన్)
- శ్రీలంక నావికాదళం (ఎస్ఎల్ఎన్)సంయుక్తాధ్వర్యంలో 8వ
ఎడిషన్ నౌకదళ విన్యాసాలు శ్రీలంకలోని ట్రింకోమలీలో ప్రారంభమయ్యాయి. 21వ తేదీ వరకు స్లినెక్స్-20
పేరుతో విన్యాసాలు ప్రదర్శించబడతాయి.
శ్రీలంక దేశం తరపున ఆ
దేశ నావికా దళానికి చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ నావల్ ఫ్లీట్ రేర్ అడ్మిరల్
బండారా జయతిలకా నేతృత్వంలోని ఎస్ఎల్ఎన్ నౌక సయూరా, గజబాహు ఈ విన్యాసాలలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.
దేశీయంగా నిర్మించిన ఎఎస్డబ్ల్యు
కొర్వెట్టస్ కమోర్తా, కిల్తానందర్తో సహా ఈశాన్య ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్
ఆఫీసర్ రియర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్లు భారత దళానికి ఈ విన్యాసాలలో
ప్రాతినిధ్యం వహించనున్నారు. దీనికి తోడు ఆయా నౌకల్లో ఏర్పాటు చేసిన భారత నేవీ
'అడ్వాన్స్డ్
లైట్ హెలికాప్టర్' (ఏఎల్హెచ్), చేతక్ హెలికాప్టర్ ఆన్బోర్డ్ ఇన్షిప్లతో సహా ఈ
విన్యాసాలలో భాగం అవనున్నాయి.
వీటితో పాటుగా మారిటైమ్
పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ డోర్నియర్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననుంది. గత ఏడాది (2019లో)
స్లినెక్స్-19 నావికా దళ విన్యాసాలు విశాఖపట్నం నగరంలో నిర్వహించారు.